డౌట్‌ సీట్ల పై కేసీఆర్‌ సీక్రెట్ సర్వే.. వ్యతిరేకత ఎంత..? అభ్యర్థిని మార్చాల్సిందేనా..?

రెండో దఫా ప్రభుత్వంలో చేయాలనుకున్న టాస్క్ లను దాదాపుగా కంప్లీట్ చేసిన కేసీఆర్ ఇప్పుడు తన దృష్టినంత ఎన్నికలపై కేంద్రీకరించబోతున్నారు.

Advertisement

కొత్త సచివాలయం, జిల్లాలో సమీకృత కలెక్టర్ల నిర్మాణాలు , హైదరాబాద్ లో 40ఫ్లై ఓవర్లు , కమాండ్ కంట్రోల్, టీ వర్క్స్, టీ హబ్ వంటివి ప్రరంభించేసిన కేసీఆర్.. ఇప్పుడు ఎన్నికలు, అభ్యర్థుల గెలుపోటములు అనే అంశంపై ఫోకస్ పెట్టారు. ఇందుకోసం ఇప్పటికే సర్వే బృందాలను రంగంలోకి దించారు. స్వయంగా కేసీఆరే ఇరవై ప్రశ్నలను రూపొందించి ప్రజల పల్స్ తెలుస్కోవాలని సర్వే టీమ్ ను ఆదేశించారు. వీటి ఆధారంగానే సర్వే బృందాలు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకొని కేసీఆర్ కు తుది నివేదిక సమర్పించనున్నారు. మోదటగా గెలుపుపై సందేహమున్న నియోజకవర్గాల్లో సర్వే బృందాలు పనిని ప్రారంభించాలని కేసీఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది.

Advertisement

కేసీఆర్ రూపొందించిన క్వశ్చనీర్ ఆధారంగా సర్వే బృందాలు ప్రజల నాడిని పసిగట్టనున్నాయి. ఇందులో ప్రధానంగా స్థానిక ఎమ్మెల్యే పని తీరు ఎలా ఉంది..? మరోసారి టికెట్ ఇవ్వోచ్చా..? టికెట్ ఇస్తే గెలుస్తారా..? సిట్టింగ్ శాసన సభ్యుడికి కాకుండా మరో బీఆర్ఎస్ నేతకు టికెట్ ఇస్తే గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయి..? ఎమ్మెల్యే అవినీతికి పాల్పడ్డారా..? నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటారా..? ఇలా 20ప్రశ్నలతో ప్రజల నుంచి సమాధానం రాబట్టి కేసీఆర్ కు సర్వే రిపోర్ట్ ను అందజేయనున్నారు. ఇదే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలలో గుబులు రేపుతోంది. సర్వేలో ఎలాంటి ఫలితం వస్తుందోనని టెన్షన్ ఫీల్ అవుతున్నారు.

మరోవైపు ఇదే కాకుండా ప్రభుత్వ పథకాలపై కూడా జనాల స్పందన ఎలా ఉందొ తెలుసుకుంటున్నాయి సర్వే బృందాలు. రూ.1లక్ష రైతు రుణమాఫీలో జాప్యం జరుగుతుండటంతో అసంతృప్తిగా ఉన్నారా..? గృహలక్ష్మి పథకానికి మూడు లక్షల సర్కార్ సాయం సంతృప్తికరంగానే ఉందా..? ఇంటింటికి తాగునీరు అందుతుందా..? వృద్దులైతే పెన్షన్ అందుతుందా..? షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాలు కొనసాగాలనుకుంటున్నారా..? ఇలా పలు అంశాలపై ప్రజల ఒపినియన్ సేకరిస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఈ సర్వే కొనసాగుతోంది. మరికొన్ని రోజుల్లోనే ఈ సర్వే ముగియనుంది. అనంతరం తుది నివేదికను కేసీఆర్ టేబుల్ మీద ఉంచనున్నారు. ఈ సర్వే నివేదిక ఆధారంగానే ఎమ్మెల్యేలకు మరోసారి టికెట్లు ఇవ్వడం జరుగుతుందని కేసీఆర్ ఇటీవల జరిగిన పార్టీ ప్లీనరీ సమావేశంలోనే స్పష్టం చేశారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సర్వే ఫీవర్ పట్టుకుంది.

Advertisement