Viral Video: రాను రాను మానవత్వం చచ్చిపోతుంది అనిపిస్తుంది. కనీసం ముసలివాడు అనే కనికరం లేకుండా ఒక వృద్ధునిపై కానిస్టేబుల్ తన ప్రతాపాన్ని చూపించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వృద్ధుడిని ఇష్టం వచ్చినట్టు భూటికాలతో తన్నుతూ రైల్వే ప్లాట్ఫారం నుంచి కిందికి వేలాడదీస్తూ కడుపులో తన్నుతూ పైశాచికంగా ప్రవర్తించాడు కానిస్టేబుల్. ఆ సమయంలో ఈ ఘటనను ఒక రైల్వే ప్రయాణికుడు సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారి దేశమంతా చెక్కర్లు కొడుతుంది.
మానవత్వం కనికరం లేని ఈ పోలీసు శాఖ దుశ్చర్యకు ఉన్నతాధికారులు పోలీస్ కానిస్టేబుల్ పై చర్యలకు సిద్ధమయ్యారు. ఈ వీడియోలో పోలీస్ కానిస్టేబుల్ వృద్ధుడైన వ్యక్తిని తనతో కనిపిస్తుంది. అంతేకాకుండా అతని ఏడిచికెళుతూ రైల్వే ప్లాట్ఫారం నుండి కిందికి వేలాడదీస్తూ పట్టాలపై పడేవిధంగా అతని కడుపులో తన్నాడు. ఆ వ్యక్తి పోలీసు జరిపిన దాడికి గాయాల పాలయ్యాడు. బాధితుడు గోపాల్ ప్రసాద్ గా తెలిసింది.
Viral Video: వృద్దుడు పై కానిస్టేబుల్ ప్రతాపం

దీనికి కారణం ఏంటని ఆరా తీయగా సదరు వ్యక్తి నాపై అసభ్య పదజాలంతో నన్ను తిట్టడంతో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయగా దాంతో ఆయన నాపై దాడికి చేశారని ఆ బాధితుడు పోలీస్ స్టేషన్లో వాంగ్మూలం సమర్పించాడు. వృద్ధుడైన గోపాల్ ప్రసాద్ గా గుర్తించారు పోలీసులు. దాడి చేసిన పోలీస్ కానిస్టేబుల్ అనంత్ శర్మగా తెలియజేశారు. అతన్ని డ్యూటీ నుంచి సస్పెండ్ చేశారని రేవా ఎస్పి తెలియజేశారు. ఏదేమైనా వృద్ధుడిపై కనికరం లేకుండా చేసిన దాడికి సోషల్ మీడియాలో అతని కి వ్యతిరేకంగా నెటిజన్లు మండిపడుతున్నారు.
@ChouhanShivraj @AshwiniVaishnaw @drnarottammisra @AmitShah
Video of mp jabalpur railway station
Is kya bartab ha police ek old age person ke liye
This police personal must be suspended and take strict action against them pic.twitter.com/8kR9RG9DMm— Sombrat arjariya (@ArjariyaSombrat) July 29, 2022