Lakshmi Devi Kataksham : జీవితంలో లక్ష్మీ కటాక్షం ఉండాలని అందరూ కోరుకుంటారు. అయితే లక్ష్మీదేవి సోదరి మాత్రం అందుకు వ్యతిరేకం. ఆమె పేరు ఆలక్ష్మి. ఆలక్ష్మికి కారం మరియు పుల్లని పదార్థాలు అంటే చాలా ఇష్టం. అందుకే ఇంటి ముందు నిమ్మకాయలు, మిరపకాయలు వేలాడదీస్తూ ఉంటారు. ఆలక్ష్మీ ఇంట్లోకి ప్రవేశిస్తే ఇంట్లో పేదరికం అనేది వస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఆ సమయంలో లక్ష్మీదేవిని ఎంత ప్రార్ధించిన ప్రయోజనం ఉండదట. ఎందుకంటే ఆలక్ష్మీ ఉన్నచోట లక్ష్మీదేవి ఉండదు. ఇద్దరూ అక్కా చెల్లెళ్లు అయినప్పటికీ ఇద్దరు ఒకే చోట అస్సలు ఉండరు. అయితే దరిద్ర దేవత ఇంట్లో ఉంటే కొన్ని సూచనలు కనిపిస్తాయని జ్యోతిష్యం చెబుతుంది.
దరిద్ర దేవత ఉండే ఇంట్లో అందరూ ఎప్పుడు నీరసంగా, ఉత్సాహం లేకుండా, ఏ పని మీద ధ్యాస తెలియకుండా ఉంటారు. అలాగే ఆలక్ష్మీ ఎక్కడైతే నివాసం ఉంటుందో ఆ ఇంట్లోని పిల్లలు పెద్దల మాటలు అస్సలు వినరు. మొండికేస్తూ ఉంటారు. తల్లిదండ్రులను అస్సలు గౌరవించరు. అలాగే కొందరు ఆడవాళ్లు ఊరికే ఏడవడం, పెద్ద పెద్దగా గొడవలు చేయడం, గట్టిగా అరుస్తూ మాట్లాడడం, చిన్న చిన్న విషయాలకే రాధాంతాలు చేయడం లాంటివి చేస్తుంటారు. ఇవన్నీ ఆలక్ష్మి దేవత ఇంట్లో ఉంటేనే జరుగుతుంటాయి. అన్నము, కూరలు, పప్పు మాడిపోయేలాగా చేస్తుంది. అలాగే ఇంట్లో ఎల్లప్పుడూ దుర్వాసనగానే ఉంటుంది. ఇల్లు ఎంత శుభ్రం చేసిన వాసన అనేది పోదు.
మరి ఇలాంటి సూచనలు ఇంట్లో కనిపిస్తే దరిద్ర దేవతను బయటికి పంపించాలి. అందుకు కొన్ని చిట్కాలు పాటించాలి. ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత చిటికెడు పసుపు కలిపి ఆ పసుపు నీటిని ఇంట్లో ఉన్న గదుల్లో చల్లితే దరిద్ర దేవత ఇంటిని వదిలి పారిపోతుంది. అలాగే ధూపాలు వేయడం, అగరవత్తులు వెలిగించడం, పచ్చ కర్పూరాన్ని అక్కడక్కడ నిలబెపెట్టడం ద్వారా దరిద్ర దేవత ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. అలాగే మసి గుడ్డలను చీకటి పడిన తర్వాత ఉతకకూడదు. చీపుర్లను నిలబెట్టకూడదు. మసి గుడ్డలు ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. సాయంత్రం పూట ఎప్పుడు నిద్రపోకూడదు. ఇలాంటి చిట్కాలు పాటిస్తే దరిద్ర దేవత ఇంట్లోకి రాకుండా ఉంటుంది. ఇంట్లో నిత్యం దీపారాధన చేయాలి. నిత్యం అగరవత్తులు, సుగంధ ద్రవ్యాలతో వేసినటువంటి ధూపాలు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో తాండవిస్తుంది.