Pawan Kalyan : రజనీకాంత్ ని విమర్శించడానికి సిగ్గుండాలి..?పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు…

Pawan Kalyan : తాజాగా మహా మ్యాక్స్ అనే కొత్త ఎంటర్టైన్మెంట్ ఛానల్ ప్రారంభం అయింది. మహా న్యూస్ ఛానల్ వారే ఈ మహా మ్యాక్స్ అనే ఎంటర్టైన్మెంట్ ఛానల్ ను ప్రారంభించడం జరిగింది. ఇక ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ….చిత్ర పరిశ్రమకు మరియు రాజకీయ రంగానికి కొంత సంబంధం ఉందని కొన్నిసార్లు సినీ ఇండస్ట్రీ కి సంబంధించిన వారిపై కొందరు ఇష్టానుసారం మాట్లాడుతారు. దానికి గల కారణం సినిమా ఇండస్ట్రీ వారు అందరికీ సాఫ్ట్ టార్గెట్ అవ్వడం. మరి ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో మంచి పొజిషన్ లో ఉన్న వారిపై విమర్శలు చేయడం వారిని ఉద్దేశించి ఎలా పడితే అలా మాట్లాడటం ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది.

shame-to-criticize-rajinikanth-pawan-kalyans-sensational-comments

ఇలాంటి సందర్భాలలో కొన్ని మీడియా ఛానల్స్ సినీ పరిశ్రమకు మద్దతుగా నిలిచాయి. అలాంటి వాటిలో మహా న్యూస్ ఛానల్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. దానికి నేను అభినందిస్తున్నాను అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. అలాగే టీవీ చానల్స్ కి మరియు టీవీలో వచ్చే న్యూస్ లకి ఎలాంటి సెన్సార్ ఉండదు. కానీ సినీ పరిశ్రమలో సినిమా విడుదల చేయాలంటే కచ్చితంగా సెన్సార్ అనేది ఉంటుంది. సినీ ఇండస్ట్రీలో జరిగే సమస్యలను ఎవరు పట్టించుకోరు కానీ దీనిపై ఆధారపడి ఎదిగే చానల్స్ ఎన్నో ఉన్నాయి. ఇప్పటికైనా సినీ పరిశ్రమ గురించి లోతుగా విశ్లేషించి పాయింట్ ఆఫ్ వ్యూ ను బయటకు తీసుకురావాలని కోరుకుంటున్నాను . ఉదాహరణగా మొన్న రజినీకాంత్ ను విమర్శించడం జరిగింది.

shame-to-criticize-rajinikanth-pawan-kalyans-sensational-comments

అలా అని చెప్పి ఆయనను మీడియా వాళ్ళు తీసుకువచ్చి మాట్లాడలేరు. వారు కళాకారులు ఎవరి జోలికి వెళ్లరు. వారు ఎప్పుడూ కూడా ప్రేక్షకులు గురించి వారిని ఎలా ఆకట్టుకోవాలనే విషయంపైనే ఆలోచిస్తూ ఉంటారంటూ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇక సినీ పరిశ్రమకు సంబంధించిన విషయాలను కాకుండా ప్రజల సమస్యలను కూడా మీడియా మిత్రులు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ ఆయన పేర్కొన్నారు. కాబట్టి కాంట్రవర్సీని అమ్ముకోకుండా దయచేసి కళనీ బతికించండి. ప్రస్తుత కాలంలో చాలామంది సినీ ఇండస్ట్రీపై బురద చల్లే పనులు చేస్తుంటారు. వాటిని మీడియా అవకాశంగా తీసుకొని మరింత ఆజ్యం పోయోద్దు. టిఆర్పి కోసం విమర్శలు చేయకండి అంటూ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.