Chiranjeevi and Ram Charan : కొరటాల శివ దర్శకత్వం వహించిన చిత్రం ‘ ఆచార్య ‘. ఈ చిత్రం ఏప్రిల్ 29న విడుదలైంది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కలిసి నటించారు. ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్స్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా ఊహించని రీతిలో ప్లాఫ్ అయింది. ఈ చిత్రం విడుదలకు ముందే భారీ మొత్తంలో థియోట్రికల్ హక్కులను డిస్ట్రిబ్యూటర్స్ కి అమ్మారు. అయితే ఆచార్య సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో డిస్ట్రిబ్యూటర్స్ కు భారీగా నష్టాలు వచ్చాయి.
ఆచార్య ఫ్రీ రిలీజ్ బిజినెస్ వ్యవహారాలను కొరటాల శివ భుజాల కెత్తుకున్నారు. ఆ తర్వాత సినిమా డిజాస్టర్ కావడం వలన డిస్ట్రిబ్యూటర్స్ కు కలిగిన నష్టాలను తీర్చే బాధ్యతలను కూడా ఆయనే డీల్ చేస్తూ వచ్చారు. ఇన్ని రోజులు కొరటాల శివ మాటపై ఆగుతూ వచ్చిన డిస్ట్రిబ్యూటర్స్ ఓపిక పట్టలేక ఇప్పుడు ఏకంగా కొరటాల శివ ఆఫీసుకు వచ్చే గొడవ పడ్డారని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన ఆఫీసులో 40 మందికి పైగా ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ ను కూల్ చేయటానికి కొరటాల శివ, మైత్రి మూవీ మేకర్స్ ఎంత ప్రయత్నం చేసినా వారు ఆగలేదు.
Chiranjeevi and Ram Charan : ‘ ఆచార్య ‘ మూవీ ప్లాఫ్ తో డిస్ట్రిబ్యూటర్స్ కి భారీ మొత్తాన్ని ఇచ్చిన మెగా హీరోలు

హ్యాష్ ట్యాగ్ జస్టిస్ ఫర్ కొరటాల శివ పేరుతో ట్విట్టర్ లోను ఈ విషయం వైరల్ అయింది. ఇది ఇలా ఉంటే 250 మంది డిస్ట్రిబ్యూటర్స్ చిరంజీవి ఇంటి ముందు ధర్నా చేస్తామని భావించినట్లు సమాచారం. డిస్ట్రిబ్యూటర్స్ ఇష్యు మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ వరకు వెళ్ళింది. దీనితో వారు తమ వంతుగా విషయాన్ని శాంత పరచారని అంటున్నారు. అందులో భాగంగా 20 కోట్ల అడ్వాన్స్ గా తీసుకున్న మొత్తాన్ని డిస్ట్రిబ్యూటర్స్ కు ఇచ్చారని పరిశ్రమలో వార్తలు వస్తున్నాయి. మిగిలిన మొత్తాన్ని కొరటాల శివ ఇవ్వడానికి రెడీ అయినట్లు సమాచారం.