Deeksha Seth : చాలామందికి అందం ఉంటుంది కానీ.. అదృష్టం ఉండదు. చాలా సినిమాల్లో అవకాశాలు వస్తాయి కానీ.. స్టార్ హీరోయిన్లుగా ఎదగరు. తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అలా వచ్చి ఇలా వెళ్లిపోయిన ఎందరో హీరోయిన్లు ఉన్నారు. అందులో ఒకరు దీక్షా సేత్. తనది ఢిల్లీ. అల్లు అర్జున్ వేదం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ భామ. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించింది కానీ.. తనకు అంతగా గుర్తింపు అయితే రాలేదు.

ఓవైపు చదువుకుంటూనే మరోవైపు మోడలింగ్ చేసింది దీక్షా సేత్. అలా.. మోడలింగ్ చేస్తుండగా డైరెక్టర్ క్రిష్ తనను చూశాడు. వేదం సినిమాలో అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత దీక్షకు వరుసపెట్టి అవకాశాలు వచ్చాయి. మిరపకాయ్ సినిమాలో రవితేజ సరసన నటించింది. గోపీచంద్ సినిమా వాంటెడ్ లోనూ నటించింది. ఆ తర్వాత రెబల్ సినిమాలో ప్రభాస్ సరసన నటించింది దీక్షా. కానీ.. రెబల్ అట్టర్ ప్లాఫ్ అవడంతో అప్పటి నుంచి తనకు పెద్దగా అవకాశాలు రాలేదు. 2016 లో చిరవగా హిందీతో సాత్ కడమ్ అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత ఇక ఇండస్ట్రీకి దూరం అయిపోయింది.
Deeksha Seth : ఇండస్ట్రీకి దూరం అయినా సోషల్ మీడియాలో యాక్టివ్
ఇండస్ట్రీకి దూరం అయినా కూడా దీక్షా సేత్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. తాజాగా తను సోషల్ మీడియాలో బికినీ ఫోటోలు షేర్ చేసి కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. బీచ్ లో బికినీతో దర్శనమిచ్చిన దీక్షను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇండస్ట్రీకి దూరం అయినా కూడా సోషల్ మీడియాలో మాత్రం తన అభిమానులకు బాగానే టచ్ లో ఉంటోంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

అయితే.. దీక్ష సోషల్ మీడియాలో తన ఫోటోలు, వీడియోను అప్పుడప్పుడు షేర్ చేస్తూనే ఉంటుంది. కానీ.. బికినీలో మాత్రం తాజాగా దర్శనమివ్వడం, తన అందాలను ఆరబోయడంతో నెటిజన్లు తనను చూసి తట్టుకోలేకపోతున్నారు.
View this post on Instagram
View this post on Instagram