Spirituality : శుక్రవారం రోజున లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలని చాలామంది పూజలు చేస్తారు. అయితే ఆరోజు కొన్ని చేయకూడని పనులు ఉన్నాయి. అవి కనుక పాటించకపోతే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఉండదు. శుక్రవారం రోజున ఇటువంటి పనులు చేయకూడదని చాలామంది సెంటిమెంట్ గా భావిస్తారు. ఈ రోజున శుభ్రంగా ఇల్లంతా ఉప్పు నీటితో క్లీన్ చేసి తలంటి పసుపు కుంకుమలను ధరించి పూజ చేసినట్లయితే ఆ ఇంట్లో ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని చాలామంది నమ్మకం. అదేవిధంగా శుక్రవారం రోజు కొన్ని చేయకూడని పనులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శుక్రవారం రోజు లక్ష్మీదేవిని స్వాగతిస్తూ పూజలు చేస్తుంటారు.
అందుకే ఈరోజు అమ్మవారి ఫొటోస్, విగ్రహాన్ని, పూజా సామాన్లు కానీ పూజ మందిరం నుంచి బయటకు తీయకూడదు. చాలామంది పాత ఫోటోలు చినిగిపోయినట్లయితే ఈ ఫోటోని పారే నీటిలో వదిలివేసి అదే స్థానంలో కొత్త అమ్మవారి ఫోటో ఉంచుతారు. పాత ఫోటోని మర్చిపోయి కూడా శుక్రవారం రోజున నీటిలో నిమజ్జనం చేయరాదు. కొత్త ఫోటోని పెట్టుకోవచ్చు కానీ పాతది పడి వేయరాదు. ఈ వారం రోజున అప్పు ఇవ్వడం తీసుకోవడం వంటి పనులు అసలు చేయవద్దు. అలాగే పాత చీపురును కూడా ఈరోజున పడి వేయవద్దు. శుక్రవారం నాడు కొంతమంది వైభవలక్ష్మి ఉపవాసం ఉంటారు.
Spirituality : శుక్రవారం రోజు ఈ పనులను చేసినట్లయితే…

ఈరోజు అమ్మాయిలకు అన్నదానం చేస్తారు. అందుకే పొరపాటున కూడా అమ్మాయిలపై కోపం చూపించవద్దు. ముఖ్యంగా ఆడపిల్లలు ఉంటే వారిని తిట్టడం, కొట్టడం వంటి వి అసలు చేయరాదు. అలాగే శుక్రవారం రోజున చీపురు, డబ్బు, బంగారం, ఉప్పు, పసుపు ,కుంకుమలను ఇవ్వకూడదు. ఈ రోజున పొరపాటున కూడా అమ్మవారిని ఇంటి నుండి బయటకు పంపరాదు. శుక్రవారం రోజున బూజులు దులిపి, మురికి బట్టలు ఉతకడం వంటివి చేయరాదు. ఆడవారు ,మగవారు జుట్టు కత్తిరించడం, గోర్లు కొరకడం, సేవింగ్ చేయడం లాంటివి చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం ఉండదు. శుక్రవారం లక్ష్మీదేవి స్తోత్రం చదవడం వల్ల ఆ ఇంటికి సంపద, శ్రేయస్సు కలుగుతుంది. ఈ రోజున దానధర్మాలు చేసినట్లయితే ఆ ఇంటి లక్ష్మీదేవి ఎప్పటికీ కొలువై ఉంటుందని చెబుతారు.
ఉదయం నిద్ర లేవగానే ఇంటి తలుపులు తెరిచి ఉంచాలి. ఎందుకంటే అదే సమయంలో లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెడుతుందని నమ్మకం. ఈ రోజున పసుపు, ఎరుపు, ఆకుపచ్చ దుస్తులను ధరించి అమ్మవారికి పూజ చేయాలి. తులసి చెట్టు దగ్గర దీపం వెలిగిస్తే సుమంగళి యోగం పది కాలాలు చల్లగా ఉంటుంది. అమ్మవారికి తెల్లటి పూలతో పూజ చేస్తే ఆ ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది. పాలతో చేసిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించాలి. వినయ విద్య అని ఇంటికి వచ్చిన వారికి ప్రసాదంగా పెట్టవచ్చు కానీ ఇంటి నుండి బయటకు వెళ్లనివ్వకూడదు. శుక్రవారం రోజు లక్ష్మి గణపతి ఆలయాన్ని దర్శించుకుని గరకే మాల సమర్పిస్తే కోరుకున్న కోరికలు త్వరగా నెరవేరుతాయి.