Acidity problem : ఈ రోజుల్లో అందరినీ వెంటాడే సమస్య ఎసిడిటీ. మనం జీర్ణశక్తిపై అశ్రద్ధ వహించడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ రోజుల్లో ఇటువంటి ఆహారం తీసుకున్న అరగకపోగా గ్యాస్, గుండెల్లో మంట వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. ప్రస్తుత కాలంలో ఒత్తిడి అధికమవడంతో చిన్నపాటి వ్యాయామం చేసేందుకు కూడా ఎవరికి సమయం ఉండడం లేదు. ఎక్కువసేపు కూర్చోవడం, వ్యాయామం చేయకపోవడం, ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల ఈ సమస్య అధికమవుతుంది.
Acidity Problem : మీరు యాసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా… అయితే వాముతో తయారుచేసిన ఈ మిశ్రమాన్ని తీసుకున్నారంటే
వాముతో జీర్ణ సంబంధిత సమస్యలతో పాటు అసిడిటీ సమస్యలను కూడా దూరం చేయవచ్చని ఆరోగ్య నిపుణులు తెలియజేశారు. వాములో ప్రోటీన్, ఫైబర్ క్యాల్షియం, ఐరన్, వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. గ్యాస్ వల్ల ఏర్పడే గుండెల్లో మంట సమస్యలతో బాధపడేవారు ఒక గ్లాస్ నీటిలో మూడు చెంచాల వాముని వేసి బాగా మరగనిచ్చి ఉదయాన్నే పరిగడుపున ప్రతిరోజు తాగినట్లయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. జీర్ణవ్యవస్థ సమస్యలతో పాటు పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కూడా కరిగిస్తుంది.

రాత్రి ఆహారం తిన్న తర్వాత కాస్త గోరువెచ్చని నీళ్లు తాగితే నిద్రలేని సమస్యలు దూరం అవుతాయి. జీర్ణ క్రియ కూడా సాఫీగా జరుగుతుంది. అలాగే పీరియడ్స్ సమస్యతో బాధపడేవారు మధ్యాహ్నం భోజనం తర్వాత ఉప్పు, నిమ్మకాయ రసం తో పాటు వాము కలిపి తింటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే మలబద్ధక సమస్యలతో బాధపడేవారు వాము నీటిని తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుండి త్వరగా బయటపడవచ్చు.