Navaratri 2022 : బతుకమ్మ సంబరాలు ప్రారంభమయ్యాయి. మహిళలు బతుకమ్మను తయారుచేసి ఆటలు పాటలాడి ఉల్లాసంగా తొమ్మిది రోజులు గడుపుతారు. ఈ సంవత్సరం సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 4 వరకు తొమ్మిది రోజులు పాటు దసరా ఉత్సవాలు కొనసాగుతాయి. పండగతో పాటు ఐదో తేదీన అమ్మవారిని నిష్టగా పూజిస్తారు భక్తులు. ఈ తొమ్మిది రోజులు పాటు దుర్గాదేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఈ సమయంలో అమ్మవారిని తొమ్మిది వేరు వేరు అవతారాలను ప్రార్థిస్తారు. చెడుపై పోరాడి మంచి సాధించిన విజయానికి ప్రతికగా విజయదశమిని జరుపుకుంటారు.
ప్రపంచవ్యాప్తంగా దుర్గాష్టమి విస్తృతంగా జరుపుకుంటారు కొందరు ఈ తొమ్మిది రోజులు కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే వెల్లుల్లి, ఉల్లిపాయలను నిషేధిస్తారు… కానీ ఎందుకు..?. అది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.సాత్విక ఆహారం స్వచ్ఛమైన శాఖాహారం. తాజా కూరగాయలు, దృణధాన్యాలు, పప్పులు, తాజా పండ్లు, విత్తనాలు, తేనె, మొలకలు, తాజా మూలికలు ఉంటాయి. ఇది మనసుని ప్రశాంతంగా, శరీరాన్ని సమతుల్యంగా ఉంచుతుంది, సాత్విక ఆహారాన్ని భుజించేవారు కృతజ్ఞత, ప్రేమ తో ఉంటారు వారిలో ప్రశాంతత కనిపిస్తుంది, చిరునవ్వు, స్నేహశీలి, ఆరోగ్యం, ఆశ, శక్తి, ఆకాంక్షలు ఇలా సమతుల్య వ్యక్తంతో నిండి ఉంటారు.
Navaratri 2022 : నవరాత్రి సమయంలో వెల్లుల్లి, ఉల్లి ఎందుకు తీసుకోకూడదు తెలుసా…

తయాసిక్ ఆహారం…
ఇందులో ఎక్కువసార్లు వేడి చేసిన ఆహార పదార్థాలు, గుడ్లు, మాంసం, ఆల్కహాలు, సిగిరెట్లు, రసాయనికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలు ఉంటాయి. తయాసికాహారాన్ని తీసుకునేవారు ఉల్లాసంగా ఉత్సాహంగా, ఊహలకు అందని విధంగా, అబద్ధం, ఆ జాగ్రత్త, నీరసంగా ఉంటారు. వీరు కాలేయం, ఉబకాయం, డయాబెటిస్ వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. శరీరానికి లేదా ఆరోగ్యానికి కలిగించే ఆహారాన్ని ఆకృతిలో తామసిక్ గా పెరిగనిస్తారు. వెల్లుల్లి, ఉంది తామసిక్ గా వర్గీకరింపబడినందున ఈ తొమ్మిది రోజులు పాటు జరిగే పండుగలో వీటిని నిషేధింపబడ్డాయి.
రజాసిక్ ఆహారం…
మసాలా దినుసులు, ఇతర సుగంధ ద్రవ్యాలు, డీ ఫ్రైడ్ ఫుడ్స్, కాఫీ, టీ, షుగర్ ఫుడ్స్, ఉల్లి, వెల్లుల్లి వంటి ఎంతో రుచికరమైన ఆహారాలు రాజాసిక్ ఆహారంలో ఉంటాయి.
ఇలాంటి ఆహారాలను తీసుకుంటే తక్షణమే శక్తి లభిస్తుంది కానీ, ఆసక్తి వెంటనే ఖర్చయిపోతుంది.
బలహీనమైన జీర్ణవ్యవస్థ ఉంటుంది, శరీర సమతుల్యతను భంగపరుస్తుంది, ఎప్పుడూ కోపంతో ఉంటారు, ఎల్లప్పుడూ ఆందోళన చెందుతూ ఉంటారు.