Navratri Tips : నవరాత్రులలో అమ్మవారి ముందు దీపం వెలిగించి పూజ ప్రారంభిస్తారు భక్తులు. అయితే పూజ వెలిగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు శాస్త్రం చెపుతుంది. మన తెలుగు పంచాంగం ప్రకారం అశ్విని మాసంలో శుక్లపక్షం ప్రతిపద తిధి నుంచి శివరాత్రులు ప్రారంభమవుతాయి. సెప్టెంబర్ 26వ తేదీన ప్రారంభమై నవరాత్రులు అక్టోబర్ ఐదు వరకు ఉంటాయి. ఈ సందర్భంగా తొమ్మిది రోజులు పాటు దుర్గాదేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు భక్తులు. నవరాత్రులు దుర్గాదేవి సన్నిధిలో జ్యోతి వెలిగిస్తారు.
ఇలా తొమ్మిది రోజులు పాటు జ్యోతి వెలుగుతూనే ఉంటుంది. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఈ అఖండ జ్యోతిని వెలిగించేటప్పుడు దిశ సరైంది గా ఉండాలి. లేదంటే అంతా నాశనం అవుతుంది. శివరాత్రుల తొమ్మిది రోజులు వరకు వ్రతాలు ఉపవాసాలు ఆచరిస్తారు. దుర్గా దేవి అనుగ్రహం కోసం అఖండ జ్యోతి కూడా వెలిగిస్తారు. ఈ పరిస్థితుల్లో దీపం వెలిగించే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వాస్తు పండితులు. ముఖ్యంగా దిశా విషయంలో జాగ్రత్త వహించాలి.
Navratri Tips : కొన్ని జాగ్రత్తలు…

నవరాత్రులు కలస స్థాపనతో పాటు జ్యోతి ప్రజ్వలన ఉంటుంది. ఈ జ్యోతి 9 రోజులు పాటు వెలుగుతూనే ఉంటుంది. వాస్తు ప్రకారం అఖండ జ్యోతి వెలిగించేటప్పుడు దిశ అనేది చాలా చాలా ముఖ్యం. తప్పుడు దిశలో వెలిగిస్తే అదృష్టం దురదృష్టంగా మారిపోతుంది. వాస్తు శాస్త్ర ప్రకారం అఖండ జ్యోతి స్థాపన ఆగ్నేయ దిశ అంటే సౌత్ ఈస్ట్ న వెలిగించాలి. ఇలా అఖండ జ్యోతి వెలిగించడం వల్ల జాతక శుభాలు కలుగుతాయి. దుర్గా దేవి అనుగ్రహం కలుగుతుంది .