Allu Arjun : అల్లు అర్జున్ ని సరికొత్తగా చూపించ బోతున్న హరీష్ శంకర్….

Allu Arjun : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అతను ఏ సినిమాలో అడుగుపెట్టిన అది బ్లాక్ బాస్టర్ అవ్వాల్సిందే.. తను ఇటీవల లో చేసిన మూవీ పుష్ప ఈ సినిమా ఘన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ఒక రేంజ్ లో దూసుకుపోయింది. అదేవిధంగా అల్లు అర్జున్ క్రేజ్ కూడా అదే రేంజ్ లో పెరిగిపోతుంది. తను ఏడుస్తూ కొన్ని సినిమాలతో బిజీగా ఉన్నాడు. అలాగే తనకు నార్త్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరిగిపోయింది. తను పుష్ప సినిమాలో పుష్ప రాజ్ అనే పాత్ర పోషించి అందర్నీ అలరించాడు. ఈ విధంగా తను క్రేజ్ అందుకొని అంత ఎత్తుకు ఎదిగిపోయింది.

ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ వెంట కొన్ని కంపెనీలు పడుతున్నాయి. తనని బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకోవాలని, తమ ప్రోడక్ట్ ను ఫేమస్ పెంచుకోవడానికి ఎంతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికీ కొన్ని కంపెనీలు వారు బన్నీ సిగ్నేచర్ చేయించుకున్నారు. ఈ మధ్యకాలంలో రెడ్ బస్ యాప్ కొరకు, త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక యాడ్ చేస్తున్నట్లు అందరికీ తెలిసిందే… అయితే ఇప్పుడు అల్లు అర్జున్ ఇంకొక యాడ్ కోసం షూటింగ్స్ లో పాల్గొన్నారు.. దీని కొరకు క్రేజీ డైరెక్టర్ హరీష్ శంకర్ తోకలిసి వర్క్ చేస్తున్నారు. ఈ యాడ్ అస్త్ర పైప్స్ కు సంబంధించిన ప్రకటనలో చిత్రీకరణ జరుగుతుంది.

Allu Arjun : అల్లు అర్జున్ ని సరికొత్తగా చూపించ బోతున్న హరీష్ శంకర్….

Allu arjun add shooting on harish shankar direction
Allu arjun add shooting on harish shankar direction

ఈ సెట్లో అల్లు అర్జున్ అలాగే హరీష్ శంకర్ చర్చించుకుంటున్న కొన్ని ఫోటోలు బయటికి వచ్చాయి. అదేవిధంగా ఈ ప్రకటన చిత్రీకరణకు గురించి ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఈ కమర్షియల్ స్టైలిష్ సార్ ఇంతకుముందు ఎప్పుడు చూడని న్యూ గెటప్ లో తనని చూడడానికి రెడీగా ఉండండి… అందరూ అంటూ డైరెక్టర్ హరీష్ ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు. అయితే బన్నీ పుష్ప చిత్రం తదుపరి ఒక రేంజ్ లో బ్రాండ్ ఎండార్స్మెంట్ లో దూసుకుపోతున్నాడు. అయితే ప్రస్తుతం కేవలం యాడ్స్ షూటింగ్లలో బిజీగా ఉన్నాడు. ప్రతి యాడ్స్ లలో సరికొత్త గెటప్లలో మన ముందుకు రాబోతున్నాడు.

ఇది ఎలా ఉండగా పుష్ప_1 మంచి సక్సెస్ అందుకోవడంతో రెండో భాగం కోసం భారీ బడ్జెట్లలో సరికొత్త ప్లాన్ చేస్తున్నారు. తాజా వార్త ప్రకారం, పుష్ప 2 కోసం పూజలు శ్రావణమాసంలో ప్రారంభించనున్నారని తెలుస్తోంది. తర్వాత హైదరాబాదులో రెగ్యులర్గా చిత్రీకరణ జరుగుతుంది. అయితే “పుష్ప ది రూల్ “చిత్రం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోతుంది. ఈ చిత్రంలో రష్మిక మందన నటిగా చేస్తున్నారు. ఇక ఇంతకుముందు ఉన్న సునీల్ ,అనసూయలు అలాగే తదితరులు ఉంటారు. అలాగే కొత్తగా పాప్ స్టార్ లను కొందరిని తీసుకోనున్నారు. దీనికి సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందించనున్నారు.