Pragna jaiswal : ప్రజ్ఞా జైస్వాల్ మధ్యప్రదేశ్ అమ్మాయి అయినప్పటికీ అచ్చం తెలుగమ్మాయిలా కనిపిస్తుంది. తనకున్న ఈ అడ్వాంటేజ్ తో తెలుగు లో మంచి సినిమాలు చేసింది ఈ భామ. మిర్చి లాంటి కుర్రాడు అనే సినిమాతో తెలుగులో మొదటి సినిమా చేసింది. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకుల ఆదరణ పొందలేదు. తరువాత కంచె సినిమాతో వరుణ్ తేజ్ తో కలిసి నటించిన ఆమె అందంతో అభినయంతో తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందింది. ప్రజ్ఞా జైస్వాల్ నటన కంచె సినిమాకు మరింత ప్లస్ అయ్యింది. ఆ విధంగా ఈ భామ తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ విధంగా ప్రజ్ఞ జైస్వాల్ తెలుగులో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది.
తర్వాత ఓం నమో వెంకటేశాయ, గుంటూరోడు, నక్షత్రం, సినిమాలు చేసినా కానీ అనుకున్నంత విజయాన్ని ఈ సినిమాలు సాధించలేకపోయాయి. ప్రజ్ఞా జైస్వాల్ జయ జానకి నాయక చిత్రంలో నటించి సినిమా మరింత విజయం సాధించడంతో మళ్లీ తను తెలుగులో ప్రేక్షకుల ఆదరణ పొందింది. తరువాత మంచు విష్ణు తో కలిసి ఆచారి అమెరికా యాత్ర లో ఈ భామ నటించిన అందరిని మెప్పించింది. ప్రెగ్నెన్సీ తర్వాత మెగాస్టార్ చిత్రంలో సైరా మూవీ లో ఛాన్స్ లభించింది.
Pragna jaiswal : అందాల ఆరబోతలో తను ఎవరికి తీసిపోనని అంటున్న ప్రజ్ఞ జైస్వాల్.

ప్రజ్ఞా జైస్వాల్ ఇప్పుడు అఖండ లో బాలకృష్ణ తో జతకట్టి తనదైన నటనతో ప్రేక్షకులను అలరించి అఖండ విషయంలో తన వంతు పాత్ర పోషించింది. ఇప్పుడు ఈ భామ అఖండ విజయాన్ని ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం ఈ భామ విదేశాల్లో అకేశన్ లో ఉంది. అక్కడ తాను చేసిన ఫోటో షూట్ ని ప్రేక్షకులకతో సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. తాను చేసిన ఫొటోస్ లో మిగతా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా తన అందాల ప్రదర్శన చేసింది. ప్రజ్ఞా జైస్వాల్ చేసిన ఈ అందాల ప్రదర్శనకి నెటిజన్లు ఫిదా అయ్యారు.