Priyamani : చిత్ర పరిశ్రమలు కథానాయకగా ఎంట్రీ ఇచ్చిన తరువాత ప్రతి నిర్ణయం ఆశించి తీసుకోవలసి ఉంటుంది. ఏమాత్రం ఆలోచించకుండా తప్పుడు నిర్ణయం తీసుకుంటే కెరీర్ మొత్తం నాశనం అవుతుంది. అలా తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా కెరియర్ ని సరైన దిశలో పెట్టిన వారే టాప్ లెవల్ కి వెళ్తారు. అలా వెళ్ళిన వారిలో ప్రియమణి ముందు వరసలో ఉంటుంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రియమణి అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. పెళ్లయిన కొత్తలో సినిమా ద్వారా జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్న నటి ప్రియమణి. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుని తర్వాత అనేక సినిమాలు చేసింది. యమదొంగ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఆమె చేసిన ప్రదర్శనకు గాను తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది.
సినిమా ఫలితంతో సంబంధం లేకుండా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ తెలుగు తమిళ భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె చేసే ప్రతి సినిమాలో తన పాత్రలోని వేరియేషన్స్ తో డిఫరెంట్ రోల్స్ చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ను వెబ్ సిరీస్ లు చేస్తూ తన తన కెరీర్ లో బిజీగా ఉంటుంది. ప్రియమణి చేసే సినిమాలో తాను మరింత ఘాటుగా కనపడేందుకు బొడ్డుపై టాటో వేయించుకోమని స్టార్ ప్రొడ్యూసర్ ఆమెను ఫోర్స్ చేశారంట. సినిమాలోని పాత్రకు అనుగుణంగా మోడరన్ లుక్ లో కల్పించడానికి ఆ పాత్రలో మరింత ఘాటుతనం కోసం బోడ్డుపై టాటూ వేయించుకోమని అనడంతో ప్రియమణి దానికి ససేవమిరా అంటూ తిరస్కరించిందట.
Priyamani : ప్రియమణి ని అక్కడ ట్యాటు వేయించుకోమని వేదించిన స్టార్ ప్రొడ్యూసర్…

అంతేకాకుండా సినిమా కథ చెప్పిన టైంలోనే ఈ విషయం కూడా చెప్పుకుంటే అప్పుడే చెప్పేసేదాన్ని కదా ఇప్పుడు చెప్పినా నేను ఒప్పుకోను అవసరమైతే మీ పారితోషం వెనక్కి తీసుకోండి అంటూ కరాకండిగా చెప్పేసిందట. అంతలా తను చేసే వర్కులో ఫుల్ క్లారిటీతో ప్రియమణి ఉంటుందని ఈ విషయం ద్వారా మనకు అర్థమవుతుంది. ప్రజెంట్ ఈ అమ్మడు పుష్ప టు సినిమాలో అద్భుతమైన పాత్రను చేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.