Rashmikia Mandana : వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న ర‌ష్మిక మంద‌న్న‌ …ఈ సారి జాక్ పాట్ కొట్టిసిందిగా..

Rashmikia Mandana : తెలుగులో `ఛ‌లో ` సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది ర‌ష్మిక మంద‌న్న‌. ఆ త‌రువాత ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన “గీత‌గోవిందం” సినిమాలో న‌టించింది. ఈ సినిమాతో ఒక్క‌సారిగా క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. దాంతో ఈ భామ‌కి వ‌రుసగా ఆఫ‌ర్లు వ‌చ్చాయి. ఏకంగా సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో స‌రి లేరు నీకెవ్వ‌రు లో జోడి క‌ట్టింది. ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కావ‌డంతో ఇక కేరీర్ ను వెన‌క్కి తిరిగి చూసుకోలేదు.

ఆ త‌రువాత అల్లు అర్జున్ న‌టించిన “పుష్ప” సినిమాలో ఛాన్ప్ కొట్టేసింది. ఈ సినిమాలో శ్రీవ‌ల్లి పాత్ర‌తో కుర్రాళ్ల మ‌న‌సుల‌ను దోచుకుంది.ఇది పాన్ ఇండియా మూవీ కావ‌డంతో అమాంతం పెద్ద హీరోయిన్ గా మారిపోయింది. తెలుగు, క‌న్న‌డ సినిమాల‌తో పాటు త‌మిళ సినిమాల‌తో బిజీ అయిపోయింది. ఈ మ‌ధ్య త‌మిళంలో కార్తీ న‌టించిన “సుల్తాన్” సినిమాలో న‌టించింది. ఈ సినిమా కూడా హిట్ కావ‌డంతో ఇప్పుడు బాలీవుడ్ వైపు ఆస‌క్తి చూపుతుంది. బాలీవుడ్ లో కూడా ఈ అమ్మ‌డుకి వ‌రుస ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి.

Rashmikia Mandana : ఈ సారి జాక్ పాట్ కొట్టిసిందిగా..

Rashmikia mandana busy in bollywood movies act with tiger shroff
Rashmikia mandana busy in bollywood movies act with tiger shroff

ఇప్పుడు బాలీవుడ్ లో సిదార్థ మ‌ల్హోత్ర తో  “మిష్ట‌ర్ మ‌జ్ను”  సినిమాలో ఎంట్రీ ఇవ్వ‌బోతుంది. ఈ సినిమా పాకిస్థాన్ నేప‌థ్యంలో సాగ‌నున్న‌ద‌ని స‌మాచారం. త్వర‌లోనే ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అలాగే అమితాబ్ బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న “గుడ్ బై” సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. వీటితో పాటు మ‌రో పెద్ద ఆఫ‌ర్ ను అందుకుందంట ఈ బ్యూటీ. శ‌శాంక్ ఖేతాన్ ద‌ర్శ‌క‌త్వంలో హీరో టైగ‌ర్ ష్ర‌ఫ్ న‌టించ‌బోతున్న సినిమాలో ర‌ష్మిక మంద‌న్న ను తీసుకోబోతున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి.