Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ తేడాది ‘ వకీల్ సాబ్ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఇప్పుడు తాజాగా మరో రీమేక్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ప్రముఖ దర్శక నటుడు సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న తమిళ చిత్రం ‘ వినోదయ సీతమ్ ‘ లో కళ్యాణ్ నటించనున్నారు. అయితే ఇందులో పవన్ తో పాటుగా మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా నటించనున్నారు. పవన్ సన్నిహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ కథలో నేటివిటీకి తగినట్లుగా సినిమా మార్పులు చేర్పులు చేసినట్లు సమాచారం.
ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సమర్పణలో ఆగస్టులో స్టేట్స్ మీదకు తీసుకెళ్లడానికి మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. పవన్ ‘ హరిహర వీరమల్లు ‘, ‘ భవదీయుడు భగత్ సింగ్ ‘ సినిమాలను కాదని ఈ సినిమాకు డేట్స్ ఇచ్చాడని టాక్.అయితే తాజా సమాచార ప్రకారం ‘ వినోదయ సీతమ్ ‘ రీమేక్ ముందుగా అనుకున్న విధంగా షూటింగ్ ప్రారంభించడం లేదు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు సెట్స్ పైకి వస్తారో క్లారిటీ లేకపోవడంతో షూటింగ్ అప్డేట్ పై దర్శక నిర్మాతలు కూడా క్లారిటీ లేదని అంటున్నారు.
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ వలన వీరికి ఇబ్బందులు తప్పట్లేదు…

అయితే పవన్ ఈమధ్య రాజకీయ కార్యక్రమాలలో బిజీగా గడిపారు. ఈ క్రమంలో అస్వస్థతకు గురై ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. మరోవైపు త్రివిక్రమ్ మహేష్ బాబు సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే ‘ వినోదయ సీతమ్ ‘ మూవీ ఎప్పుడు మొదలవుతుందో తెలియకపోవడంతో సాయిధరమ్ తేజ్, సముద్రఖని ఎటు తేల్చుకోలేక పోతున్నారని సమాచారం. ఇది తేజ్ తో చేస్తున్న నిర్మాతలను కూడా సిబ్బంది పెడుతుందని అంటున్నారు.
గతేడాది సాయి ధరం తేజ్ బైక్ యాక్సిడెంట్ వలన కొన్ని నెలలు రెస్టు తీసుకున్నాడు. తిరిగి కోలుకున్న తర్వాత బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మించే మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. అయితే మేనమామ సినిమా కారణంగా తేజ్ ప్రాధాన్యత మారిపోయిందని మిస్టిక్ థ్రిల్లర్ షూటింగ్ కు బ్రేక్ ఇచ్చాడని టాక్. అంతేకాదు పవన్ తో సినిమా పూర్తయ్యే వరకు వేరే చిత్రాలకు దూరంగా ఉండాల్సి వచ్చిందంట.
మరోవైపు సముద్రఖని కూడా పవన్ సినిమా మీద దృష్టి పెట్టాలని కొన్ని ఇతర కమిట్మెంట్లను హోల్డ్ లో పెట్టారని తెలుస్తుంది. అలాగే గత రెండేళ్లుగా షూటింగ్ దశలోనే ఉన్న ‘ హరిహర వీరమల్లు ‘ మూవీ ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియదు అని డైరెక్టర్ క్రిష్, నిర్మాత ఎం ఎం రత్నం పవన్ కాల్ కోసం వేచి చూస్తున్నారు. అలాగే ‘ భవదీయుడు భగత్ సింగ్ ‘ చిత్రం ప్రారంభించాలని పవన్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు డైరెక్టర్ హరీష్ శంకర్, మైత్రి నిర్మాతలు.