Viral News : జడ వేసుకోలేదని ఆగ్రహించిన ఉపాధ్యాయురాలు…..చివరికి ఏం చేసిందో మీరే చూడండి….

Viral News  : కాకినాడ జిల్లాలోని ఓ పాఠశాలకు చెందిన విద్యార్థినిలు జడ వేసుకోకుండా జుట్టు విరబోసుకుని క్లిప్పులు పెట్టుకుని వచ్చారని కోపంతో ఆ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయురాలు వారి జుట్టు కత్తిరించింది. దీంతో విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఉపాధ్యాయురాలిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆందోళన చేపట్టారు…పూర్తి వివరాల్లోకి వెళితే…

Kakinada School Teacher Incident

కాకినాడలోని సర్వేపల్లి రాధాకృష్ణ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో మంగాదేవి అనే మహిళ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా తొమ్మిదో తరగతికి చెందిన విద్యార్థినిలు జడలు వేసుకోకుండా క్లిప్పులు పెట్టుకుని తరగతులకు వస్తున్నారు. దీంతో వారి కేశాలంకరణ పై ఉపాధ్యాయురాలు మంగాదేవి విద్యార్థులను హెచ్చరిస్తూ వస్తుంది. అయినా ఉపాధ్యాయురాలు మాటలు లెక్కచేయని విద్యార్థినిలు బుధవారం కూడా జడ వేసుకోకుండా పాఠశాల తరగతులకు హాజరయ్యారు. ఎన్నిసార్లు చెప్పినా టీచర్ మాట లెక్క చేయకపోవడంతో కోపోద్రిక్తురాలైన ఉపాధ్యాయురాలు 8 మంది విద్యార్థినిల జుట్టు చివర కొంతమేర కత్తిరించింది.

School_Teacher_Cut_Students_Hair

ఇక ఈ విషయం తెలుసుకున్న విద్యార్థినిల తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలని ,డిమాండ్ చేస్తూ ఆందోళనలో చేపట్టారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తామని అధికారులు సర్ది చెప్పడంతో వారు శాంతించారు. ఇక ఈ విషయంపై కాకినాడ అర్బన్ ఎంఈఓ చేవూరు రవి , డివైఈవో రాజు వద్ద ప్రస్తావించి నివేదికను అందజేసినట్లు చెప్పారు. నివేదికకు స్పందించిన విద్యాశాఖ కమిటీ ఉపాధ్యాయురాలు మంగాదేవిని సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.