Viral News : భార్య రీల్స్ చేస్తుందని భర్త దారుణం…ఏం చేశాడో మీరే చూడండి…

Viral News : ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ప్రభావం ప్రజలపై ఎంతగా పడుతుందో అందరికీ తెలిసిందే. వ్యక్తిగత జీవితాలతో పాటు సమాజంపై కూడా సోషల్ మీడియా విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.ఎన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్నిసార్లు అనేక రకాల సమస్యలకు సోషల్ మీడియా కారణం అవుతుంది . అయితే తాజాగా సోషల్ మీడియాలో లైక్స్ వ్యూస్ కోసం రీల్స్ చేస్తున్న భార్య తతంగాన్ని భరించలేని ఓ భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర చర్చానియాంశంగా మారింది. పూర్తి వివరాల్లోకెళ్తే

గుంటూరు జిల్లా తాడికొండ మండలానికి చెందిన వీరయ్య అనే వ్యక్తికి 10 సంవత్సరాల క్రితం ద్రాక్షవల్లి అనే అమ్మాయితో పెళ్లయింది. కోన్నాలపాటు వీరి కాపురం సజావుగా సాగిన ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవలు రావడం ప్రారంభమయ్యాయి. దీంతో గత ఏడు సంవత్సరాలుగా విడివిడిగానే జీవిస్తున్నారు. ఈ క్రమంలోనే భార్య ద్రాక్షవల్లి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో ఆమె ఫోటోలను షేర్ చేయడంతో పాటు వీడియోలు కూడా షేర్ చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆమె వీడియోలు కూడా చాలామంది వీక్షిస్తూ ఉంటారు. దీంతో ఫాలోవర్స్ కూడా విపరీతంగా పెరిగారు. అయితే ఆమె చేస్తున్న వీడియోలను వీరయ్య ప్రాంతానికి చెందిన వారు కూడా చూస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ద్రాక్షవల్లి గురించి చెడుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అయితే వీరయ్య ద్రాక్షవల్లితో విడిగానే ఉంటున్నప్పటికీ స్థానికులు స్నేహితులు ఆమె చేస్తున్న వీడియోలపై కామెంట్స్ చేయడంతో అవి కాస్త వీరయ్య దృష్టికి వచ్చాయి.

అంతేకాక ఆమెకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానాలు కూడా పెరిగాయి. ఈ క్రమంలోనే వీరయ్య మనస్థాపానికి గురయ్యాడు. తన బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమయ్యాడు. ఈ క్రమంలోనే తనువు చాలించాలనుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈనెల 9వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశారు. అయితే ఇది గమనించిన కుటుంబ సభ్యులు మరియు బంధువులు వీరయ్యని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇక అక్కడ చికిత్స పొందుతూ వీరయ్య ఇటీవల మరణించడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. దీంతో వీరయ్య కుటుంబ సభ్యులు అందించిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న తాడికొండ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేయడంతో కుటుంబం మధ్య విభేదాలు రావడం చివరికి భర్త ఇలా చనిపోవడంతో స్థానికంగా ఈ న్యూస్ తీవ్ర చర్చానియాంశంగా మారింది.