Chandrababu Judicial Remand : మాజీ ముఖ్యమంత్రి టిడిపి అధినేత చంద్రబాబు కు రెండు బ్యాడ్ న్యూస్ లు వచ్చాయి. అదేంటంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిందితుడుగా ఉన్న చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ ను నవంబర్ 1 వరకు పొడిగించింది. అలాగే చంద్రబాబు సెక్యూరిటీ మరియు ఆరోగ్యం పై జడ్జ్ వద్ద ప్రత్యేకంగా ప్రస్తావించారు . అలాగే చంద్రబాబు బాధ్యతపై అనుమానాలు ఉన్నాయని. ఏమైనా అనుమానాలు ఉంటే రాతపూర్వకంగా ఇవ్వాలని న్యాయమూర్తి చంద్రబాబుకు తెలియజేశారు. ఇది ఇలా ఉండగా మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఇటీవల ఏపీ హైకోర్టు విచారణ జరిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సీనియర్ లాయర్ సిద్ధార్థ లూత్ర వాదించగా సిఐడి తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వారి వాదనలను వినిపించడం జరిగింది.
ఈ క్రమంలో సుధాకర్ రెడ్డి వాదిస్తూ చంద్రబాబుమధ్యంతర బెయిల్ సుప్రీంకోర్టు నిరాకరించిందని, అలాగే ఈ బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో తీర్పు రిజర్వుల్లో ఉందని… ఇక సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ పెండింగ్ లో ఉండగా ఇప్పుడు హైకోర్టులో విచారణ జరపడం తగదని కోరారు. అలాగే చంద్రబాబు ఆరోగ్యం బాగాలేదన్న కారణంతో సుప్రీంకోర్టులో వాదించారని అయినప్పటికీ మధ్యంతర భైయిల్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో మద్యంతర బేయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది అనడం నిజమేనా అని హైకోర్టు చంద్రబాబు తరపు లాయర్ ని ప్రశ్నించగా…. సుప్రీంకోర్టులో చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి రిపోర్ట్స్ అందించలేదని తెలియజేశాడు. సుప్రీంకోర్టులో మధ్యంతర బేయిల్ మౌలికంగా మాత్రమే అడిగామని కానీ ఇప్పుడు చంద్రబాబు ఆరోగ్యం సరిగా లేదు కాబట్టి బెయిల్ పిటిషన్ వెంటనే విచారణ జరపాల్సిందిగా కోరారు.
అంతేకాక ఈ కేసులో ఇప్పటికే చాలామందికి బెయిల్ వచ్చింది కావున చంద్రబాబుకు కూడా ఇవ్వాల్సిందిగా కోర్టుకు తెలియజేశారు. ఈ నేపథ్యంలో మధ్యంతర బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉండడం వలన ఈ కేసు పై విచారణ జరపలేమని హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే వ్యక్తిగత డాక్టర్ తో చంద్రబాబు ఆరోగ్య పరీక్షలు చేయించేందుకు మీకేమైనా అభ్యంతరం ఉందా అని న్యాయమూర్తి అడగడం జరిగింది. అలాగే వ్యక్తిగత డాక్టర్ తో వైద్య పరీక్షలు నిర్వహించేందుకు మధ్యాహ్నానికి వాయిదా వేశారు. అయితే శుక్రవారం రోజు సుప్రీంకోర్టులో స్కిల్ డెవలప్మెంట్ కేసు పై నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుపై అందరిలో ఉత్కంఠత మొదలైంది. మరి సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పును వెల్లడిస్తుందా లేదా దసరా సెలవులు ముగిసిన తర్వాత వెల్లడిస్తుందా అనేది వేచి చూడాలి.