IND VS Srilanka : శ్రీలంకను చిత్తు చేసి సెమీస్ కు దూసుకెళ్లిన టీం ఇండియా…

IND VS Srilanka : 2023 వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఈరోజు జరిగిన భారత్ శ్రీలంక మ్యాచ్ ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ అన్నింటిలో మరో ఎత్తని చెప్పుకోవాలి . ఎందుకంటే ఇలాంటి మ్యాచ్ లు చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఇక ఈ మ్యాచ్లో భారత్ వార్ వన్ సైడ్ చేసి సత్తా చాటింగు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 357 పరుగులు లక్ష్యాన్ని చేసి భారత బ్యాటర్ సత్తా చాటగా…మేము కూడా ఏమాత్రం తీసిపోయేది లేదంటూంటూ బౌల్లెర్స్ కూడా సత్తా చాటారు . ఈ క్రమంలోని శ్రీలంక 55 పరుగులకే ఆల్ అవుట్ అయింది. అయితే ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేయగా సెకండ్ ఇన్నింగ్స్ లో శ్రీలంక 358 పరుగుల లక్ష్యానికి కనీసం 20 ఓవర్లు కూడా పూర్తి చేయకుండానే 55 పరుగులకే ఆల్ అవుట్ అయ్యారు.

team-india-who-defeated-sri-lanka-and-going-to-the-semis

దీంతో భారత్ ఏకంగా 302 పరుగులు తేడాతో శ్రీలంకపై భారీ విజయాన్ని సాధించి వన్డే వరల్డ్ కప్ లో సెమీస్ కు చేరిన తొలి జట్టుగా రికార్డు క్రియేట్ చేసింది. అయితే ఇప్పటివరకు ఐసీసీ వరల్డ్ కప్ 2023 లో సెమీస్ కు ఏ టీం కూడా వెళ్లలేదు. మొట్టమొదటిసారి భారత్ సెమీస్ కు అర్హత సాధించి రికార్డు నెలకొల్పింది. అయితే ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ క్రికెటర్స్ ఓపెనర్ శుబ్ మన్ గిల్ 92 పరుగులు చేసి సెంచరీకి చాలా చేరువలో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ 88 పరుగులు చేసి సెంచరీ చేయకుండానే అవుట్ అవ్వడం జరిగింది.

team-india-who-defeated-sri-lanka-and-going-to-the-semis

అనంతరం శ్రేయస్ అయ్యర్ కూడా 82 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టారు. ఆ తర్వాత రవీంద్ర జడేజా 35 , కేఎల్ రాహుల్ 21 , సూర్య కుమార్ యాదవ్ 1 , షమీ 2, రోహిత్ శర్మ 4 పరుగులు చేశారు. ఇక శ్రీలంక బౌల్లెర్స్ లో దిల్షుక్ మధుశంక 5 వికెట్లు తీసి రికార్డు నెలకొల్పారు. ఇక శ్రీలంక బ్యాటింగ్ విషయానికొస్తే కాసున్ రజిత్ 14 పరుగులు, మహిష్ తీక్షణ 12 పరుగులు , మ్యాథ్యుస్ 12 పరుగులు చేశారు. ఇక భారత బౌలర్స్ లో షమీ 5 వికెట్లు , సిరాజ్ 3 వికెట్లు , బూమ్రా మరియు జడేజా చెరో వికెట్ తీసుకున్నారు. ఇక 5 వికెట్లు తీసినందుకుగాను షమీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ని దక్కించుకున్నారు.